ఏడాది గడిచినా ఆయన మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోంది: హరికృష్ణకు చంద్రబాబు నివాళి

  • నేడు హరికృష్ణ ప్రథమ వర్ధంతి
  • హరికృష్ణను స్మరించుకున్న చంద్రబాబు
  • ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని వ్యాఖ్య
నేడు నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా నిలిచిపోయారని అన్నారు. ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మనకు దూరమై ఏడాది గడిచినా... ఇంకా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోందని చెప్పారు. హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందామని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Hari Krishna
Telugudesam

More Telugu News